లవర్ తో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో అమ్మానాన్న ఆత్మహత్య

లవర్ తో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో అమ్మానాన్న ఆత్మహత్య

కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తమను కాదని ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోవడాన్ని ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. నచ్చజెప్పినా ఆమె వినకపోవడంతో చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డారు.  కాలేజీ వెళ్లే తమ కూతురు ప్రేమించిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఉన్నికృష్ణ పిళ్లై, బిందు దంపతులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మోతాదుకు మించి మాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బిందు శనివారం ( ఫిబ్రవరి 17)  రాత్రి మృతి చెందగా.. ఉన్నికృష్ణ పిళ్లై ఆదివారం( ఫిబ్రవరి 18)  ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. 

బంధువులు చెబుతున్న దాని ప్రకారం..  కాలేజీలో చదువుతున్న  ఆత్మహత్య చేసుకున్న దంపతుల కుమార్తె కాలేజీలో చదువుతూ ఓ వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తల్లి దండ్రులు కుమార్తెను మందలించారు. లవ్​ ఎఫైర్​ మానుకోమని పదే పదే చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన తల్లి దండ్రులు దంపతులు అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు . బెడ్రూంలో దొరికిన  సూసైడ్ నోట్ లో తమ కూతురుకు మా శవాలను చూపించొద్దని లేఖలో పేర్కొన్నారు.